హైదరాబాద్: గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించేందుకు వచ్చిన తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఎం.కోదండరామ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
సచివాలయంలోని భవనాల కూల్చివేతను నిరసిస్తూ ఈరోజు ప్రతిపక్ష నేతలు చలో గన్ పార్క్ పిలుపునిచ్చారు. గన్ పార్క్ అమర వీరుల స్థూపం వద్ద నిరసన తెలపాలని పిలుపునిచ్చిన కాంగ్రెస్, సీపీఐ, తెలంగాణ జన సమితి పార్టీ లు నిర్ణయించిన విషయం తెలిసిందే.
ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన పిలుపుతో ఇవాళ గన్ పార్క్ వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. ఈలోపు అక్కడకు చేరుకున్న జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ తో పాటు అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. నివాళులు అర్పించేందుకు ఏలాంటి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Next Post
You might also like