• శుక్రవారం 9,841 మంది భక్తుల కు కలియుగ దైవం
శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కల్గినది,
• శుక్రవారం నాడు 3715 మంది భక్తులు స్వామి వారికి
తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు
• శుక్రవారం నాడు స్వామివారికి హుండీలో భక్తులు
సమర్పించిన నగదు రూ.65 లక్షలు
• కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరిమిత సంఖ్యలో భక్తులను
శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్న టీటీడీ
• గంటకు 7 నుంచి 8 వందల మంది శ్రీవేంకటేశ్వరుని
దర్శించుకునే విధంగా టీటీడీ ఏర్పాట్లు
• శ్రీ భూ వరాహ స్వామి వారి కైంకర్యాలు ఏకాంతంగా
నిర్వహిస్తున్న టీటీడీ
• ప్రత్యేక ప్రవేశ దర్శనం (ఆన్ లైన్ రూ.300), టైం స్లాట్
టోకెన్లను కలిగిన భక్తులు మాత్రమే తిరుమలకు
రావాలని టీటీడీ విజ్ఞప్తి
• అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద దర్శనం టిక్కెట్ల వేరిఫికేషన్
కొరకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు
• అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ర్యాండం విధానంలో 100
కరోనా టెస్టులు
• టీటీడీ ఉద్యోగులకు ప్రత్యేక కౌంటర్లలో కరోనా పరీక్షలు
• మస్కులు ధరించిన భక్తులను మాత్రమే ఆలయంలోకి
అనుమతి
• క్యూలైన్ లో భక్తులు భౌతిక దూరం పాటించే
విధంగా చర్యలు
• ఆలయంలో తీర్థం, శఠారీ రద్దు చేసిన టీటీడీ
• తిరుమలలోని శ్రీవారి పాదాలు, పాపవినాశనం,
జాపాలి, ఆకాశ గంగ తీర్థాలకు భక్తుల అనుమతి
నిషేధం.