హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ 129 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు తెలంగాణ మీడియా బులిటెన్ విడుదల అయ్యింది.
జీహెచ్ఎంసీ పరిధిలోనే 108 కేసులు వచ్చాయి. ఈరోజు కొత్తగా 129 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 3020కి చేరింది. ఇందులో యాక్టివ్ కేసులు 1365 ఉండగా, కోలుకున్నవారు 1556 మంది ఉన్నారు. ఈరోజు కరోనాతో ఏడుగురు మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 99 కి చేరింది.