బీజేపీ నాయకుడు విష్ణు సంచలన వ్యాఖ్యలు
అమరావతి: రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గాన్ని మారుస్తామని సీఎం వైఎస్.జగన్ ప్రమాణ స్వీకారం తరువాత చెప్పారని.. కానీ రెండున్నరేళ్ల తర్వాత ఏపీ సీఎం కూడా మారి పోవచ్చని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీకి మహిళా సీఎం, వైఎస్.భారతి అయితే ప్రజలు సంతోషిస్తారని ఆయన అన్నారు. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గాన్ని మారుస్తామని జగన్ చెప్పారని.. ఆ లోపే ఆయన మారిపోవచ్చన్నారు. ఉప ముఖ్యమంత్రిగా మహిళలకు అవకాశం ఇచ్చినట్లే.. ఏపీకి మొట్టమొదటి మహిళా సీఎం ని చేసి జగన్ చరిత్ర సృష్టించాలన్నారు. జగన్ సతీమణి భారతి తదుపరి సీఎం అయితే ప్రజలు సంతోషిస్తారని రాజు అభిప్రాయపడ్డారు.
భారతి ముఖ్యమంత్రి అయితే ప్రజల కష్టాలు తెలుసుకొని న్యాయం చేస్తారని ఆయన అన్నారు. ఉత్తర కొరియా నియంత అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తో జగన్ను పోల్చారు. ఆంధ్రా కిమ్ జగన్ మోహన్ రెడ్డి అంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఆయనకు ప్రజల కష్టాలు తెలియడం లేదని విమర్శించారు. తక్షణమే స్థానిక సంస్థల ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని అన్నారు. అక్రమాలు జరిగినందున ఏకగ్రీవాలను రద్దు చేయాలని విష్ణకుమార్ రాజు డిమాండ్ చేశారు.