హైదరాబాద్: ఇప్పటికే సినీ నటుడు నాగబాబు గాడ్సేపై పలు ట్వీట్లు పెట్టి సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే.. తాజాగా ‘‘భారత కరెన్సీ నోట్లపై కూడా ఆయన ట్వీట్ చేశారు. నోట్లపై సుభాష్ చంద్రబోస్, అంబేద్కర్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, లాల్ బహదూర్ శాస్త్రి, పీవీ నరసింహరావు, అబ్దుల్ కలాం, వీడీ సావర్కర్, వాజ్ పెయిలాంటి మహానుభావుల చిత్రాలు చూపాలని ఉంది.
ఎందుకంటే స్వతంత్ర భారత ఆవిర్భావానికి కృషి చేసిన మహానుభావులని జనము మర్చిపోకూడదని ఒక ఆశ. గాంధీ గారు బ్రతికి ఉంటే ఆయన కూడా తనతో పాటు దేశానికి సేవ చేసిన దేశభక్తులని గౌరవించమని తప్పకుండా చెప్పేవారు. దేశం కోసం జీవితాల్ని త్యాగం చేసిన మహానుభావుల పేర్లు తప్ప మొహాలు గుర్తు రావడం లేదు. భావితరాలకు కరెన్సీ నోట్ల పై వారి ముఖ పరిచయం చెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.’’ అంటూ ట్వీట్ చేశారు.
Indian కరెన్సీ నోట్ల మీద సుభాష్ చంద్ర బోస్,అంబేద్కర్, భగత్ సింగ్,చంద్ర శేఖర్ ఆజాద్,లాల్ బహదూర్ ,పీవీ నరసింహారావు,అబ్దుల్ కలాం,సావర్కార్,వాజపేయ లాంటి మహానుభావుల చిత్రాలను కూడా చూడాలని ఉంది.ఎందుకంటే స్వతంత్ర భారత ఆవిర్భావానికి కృషి చేసిన మహానుభావులని జనము మర్చిపోకూడదని ఒక ఆశ.
— Naga Babu Konidela (@NagaBabuOffl) May 22, 2020