భోపాల్: చాతర్ పుర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఉన్న బావిలోకి కారు దూసుకెళ్లడం తో ఆరుగురు జలసమాధి అయ్యారు. స్థానికులు మరో ముగ్గురిని కాపాడారు.
ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వస్తుండగా జిల్లాలోని మహారాజ్పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వాహనాన్ని బయటకి తీశారు.ప్రమాదం లో గాయపడిన క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. బాధితులు ఉతఉత్తర్ప్రదేశ్ రాష్ట్రం మహోబా జిల్లాలోని స్వసా గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి, మృత దేహాలను ఆసుపత్రి కు పంపించారు.