ఢిల్లీ: ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంకు (ఏడీబీ) ఇండియాకు రూ.11వేల కోట్ల రుణం మంజూరు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఈ ఏడాది మార్చిలో ప్రారంభించిన ప్రభుత్వ అత్యవసర ప్రతిస్పందన కార్యక్రమాలను సక్రమంగా అమలు చేసేందుకు ఈ రుణం ఉపయోగపడుతుందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల అదనపు కార్యదర్శి సమీర్ కుమార్ చెప్పారు.
అలాగే, ఆర్థిక వృద్ధిని పెంచడానికి, పునరుద్ధరణకు సాధ్యమైన మద్దతు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఏడీబీ ఇండియాకు తెలిపిందన్నారు. క్రెడిట్ గ్యారంటీ పథకాల ద్వారా ఆర్థిక సదుపాయాన్ని సులభతరం చేయడం, తద్వారా ప్రభావిత సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) చేయూత అందించనున్నట్లు ఆయన వివరించారు