అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 48 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,205 కు చేరింది.
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య 803 గా ఉంది. వీరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు ఈ మహమ్మారి బారినుంచి కోలుకుని 1,355 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయినారు. కరోనాతో 49 మంది మృతి చెందారు.